NZB: మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధానికి జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అ. కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులను సూచించారు. నిజామాబాద్ IDOCలో బుధవారం ఆయన అధ్యక్షతన మత్తు పదార్థాల నిరోధక కమిటీ జిల్లా స్థాయి సమావేశం జరిగింది. యువత మత్తు బారిన పడకుండా చూసేందుకు విద్యాసంస్థల్లో ప్రత్యేక నిఘా, అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.