NLG: ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వేసవి సెగలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. భానుడి భగభగలకు ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 43 డిగ్రీలు దాటడంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటలకే ఎండ తీవ్రత మొదలవుతుండటంతో, మధ్యాహ్నం అయ్యే సరికి రోడ్లన్నీ జనసంచారం లేక కర్ఫ్యూను తలపిస్తూ నిర్జీవంగా మారుతున్నాయి.