JGL: కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామంలో నిర్వహించిన ‘కేత్ బచావో అభియాన్’ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నాగమణి రైతులకు అవగాహన కల్పించారు. వరి కోత అనంతరం కొయ్యకళ్లకు నిప్పు పెట్టవద్దని సూచించారు. అలా చేస్తే నేల సారం తగ్గడంతో పాటు అగ్నిప్రమాదాల ప్రమాదం ఉంటుందన్నారు. జీవో-27 నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు విధిస్తారని హెచ్చరించారు.