MNCL: బెల్లంపల్లిలోని ఇండ్లకు, స్థలాలకు రిజిస్ట్రేషన్లు అయ్యేలా చూడాలని మున్సిపల్ ఛైర్ పర్సన్ దావా స్వాతి, కౌన్సిలర్లు కోరారు. బుధవారం అదనపు కలెక్టర్ చంద్రయ్యకు వినతిపత్రం అందజేశారు. పట్టణంలోని ఇండ్లకు రిజిస్ట్రేషన్లు జరగక అత్యవసర పరిస్థితులలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇంటిని, స్థలాన్ని తనకా పెట్టాలన్న, విక్రయించాలన్నా పనులు జరగడంలేదని అన్నారు.