ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో భక్తాదుల స్వామి వారికి సమర్పించిన హుండీ కానుకలను శుక్రవారం లెక్కింపు చేశారు. ఈవో విజయరాజు మాట్లాడుతూ.. 29 రోజుల కానుకలను లెక్కింపు చేయగా రూ.25,56,798 నగదు, బంగారం 18 గ్రాములు, వెండి 910 గ్రాములు, యూఎస్ఏ డాలర్లు 3, అన్నదాన హుండీ ద్వారా రూ.92,260 ఆదాయం వచ్చింది అన్నారు.