NZB: న్యాయవ్యవస్థపై తాము పెట్టుకున్న నమ్మకం నిలబడిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. శుక్రవారం కోర్టు తీర్పు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తాను ముందు నుంచి చెప్తున్న విధంగానే రాజకీయ కుట్రలో భాగంగా పెట్టిన కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటకు రావడం జరిగిందన్నారు. ఈ కేసు పెట్టిన నుంచి తనకు అండగా నిలిచిన వారందరిని తాను ఎప్పటికీ మర్చిపోనన్నారు.