TG: వెలుగుమట్ల భూబాధితులకు భరోసా కల్పించేందుకు BJP MP ఈటల రాజేందర్.. రేపు ఖమ్మం వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈటల బాధితులతో ముఖాముఖి సమావేశం కానున్నారు. క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న కష్టాలను నేరుగా అడిగి తెలుసుకుంటారు. పార్టీ పక్షాన బాధితులకు చట్టబద్ధంగా పూర్తి న్యాయం జరిగేలా అవసరమైన అన్ని వేదికలపైనా పోరాటానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేయనున్నారు.