VKB: రోడ్డు ప్రమాదాల నివారణపై డ్రైవర్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో అధికారులు కీలక సూచనలు చేశారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, నిద్రలేమి, ఫోన్ వినియోగమే ప్రమాదాలకు ప్రధాన కారణాలని పేర్కొన్నారు. ముఖ్యంగా కంటి చూపు లోపం ఉన్నవారు రాత్రి వేళల్లో వాహనాలు నడపడం ముప్పుతో కూడుకున్నదని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.