TG: నాగర్కర్నూల్ జిల్లా శ్రీశైలం జాతీయ రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కల్వకుర్తి మండలం తాండ్ర దగ్గర కారు మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందగా, మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.