SRCL: మత్స్య కార్మికులకు ఉపాధి కల్పించేందుకు, ప్రభుత్వం పథకాలు అమలు చేస్తున్నదని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోయినపల్లి మండలం నర్సింగాపూర్ గ్రామంలో రూ. 8.91 లక్షలతో మంచినీటి చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, శుక్రవారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు.