EG: 2027 గోదావరి పుష్కరాలు సంపూర్ణ కాలుష్య రహితంగా, ప్లాస్టిక్ రహితంగా, అత్యంత ఆధ్యాత్మిక శోభతో నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. భావితరాల భవిష్యత్తుకు కాలుష్య రహిత సమాజాన్ని అందించే భాద్యత ప్రభుత్వం తీసుకుందన్నారు.