TPT: నారాయణవనం మండలం భీమునిచెరువులో జరుగుతున్న ఎల్లమ్మ తిరునాళ్లలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం భక్తులు గోవింద నామస్మరణతో అగ్నిగుండం ప్రవేశం చేయగా, కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా సాగింది.