VZM: కొత్తవలస పట్టణంలో ఉన్న కళ్యాణ మండపాల యాజమానులతో సీఐ టి.వి.విజయకుమార్ శనివారం ఇటీవల తరచుగా జరుగుతున్న నేరాలపై శనివారం అవగాహన కల్పించారు. తరచుగా జరుగుతున్న నేరాలు దృష్టిలో ఉంచుకుని తమ కళ్యాణ మండపాల వద్ద నాణ్యతతో కూడిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నేరం జరిగిన గంటలో నేరస్థులను పట్టుకోవచ్చని చెప్పారు. పోలీసు వారికి సహకరించాలని కోరారు.