ELR: ఎల్నినో ప్రభావంతో వాతావరణ మార్పులు, తక్కువ వర్షపాతం నెలకొన్న నేపథ్యంలో, ప్రకృతి వ్యవసాయం, నవధాన్యాల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో దీనికి సంబంధించిన అవగాహన కరపత్రాన్ని ఆమె ఆవిష్కరించారు. నవధాన్యాల సాగుతో తక్కువ నీటితో, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చన్నారు.