మన్యం జిల్లాలో ప్రజారోగ్య రక్షణే ధ్యేయంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్ ప్రభాకర రెడ్డి ఆదేశించారు. ఇవాళ కలెక్టరేట్లో ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను అమలుతీరును అడిగి తెలుసుకున్నారు.