సత్యసాయి: తాడిమర్రి మండలం పిన్నదరి గ్రామ ఎస్సీ కాలనీలో వేసవి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు పంచాయతీ నిధులతో ఇక్కడ కొత్త బోరు వేయించి, నూతన మోటార్ ఏర్పాటు చేశారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఈ చర్యలు తీసుకున్నారు.