KDP: మైదుకూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉచితంగా కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్ నారాయణరెడ్డి శనివారం తెలిపారు. యువతకు, విద్యార్థులకు ఉపాధి అవకాశాలను పెంపొందించాలన్న లక్ష్యంతో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ ఉచిత కంప్యూటర్ శిక్షణను నిర్వహిస్తున్నామన్నారు. ఇంటర్ విద్యను పూర్తి చేసినవారు, అంతకంటే విద్యార్హత ఎక్కువ ఉన్నవారు అర్హులన్నారు.