ప్రకాశం: పొగాకు రైతులకు కిలోకు రూ. 350 గిట్టుబాటు ధర నిర్ణయించి, దళారీ వ్యవస్థను నిర్మూలించాలని జిల్లా పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇరిగినేని వెంకట నరసయ్య డిమాండ్ చేశారు. శనివారం తూర్పునాయుడుపాలెంలో రైతులతో కలిసి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామికి వినతిపత్రం అందజేశారు. పొగాకు రైతులు తక్కువ ధరలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు.