కోనసీమ: స్వచ్ఛమైన పరిసరాలు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల భాగస్వామ్యంతోనే “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” సాధ్యమవుతుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. సాలూరు పట్టణంలో శనివారం నిర్వహించిన “స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో పాల్గొన్న ఆమె స్వయంగా చీపురు పట్టి రోడ్లు, కాలువలను శుభ్రం చేశారు.