KRNL: ఆదోని పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే తనయుడు జయ మనోజ్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబాలకు ధైర్యం చెబుతూ, బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.