అనకాపల్లి: అచ్యుతాపురం మండలం పూడిమడకలో సీఐటీయూ 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సుమారు 250 మందికి బీపీ, షుగర్, కంటి, దంత పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్మికుల హక్కుల పోరాటంతో పాటు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శంకర్రావు తెలిపారు.