కడప జిల్లాకు చెందిన విద్యార్థిని PG సెట్లో సత్తా చాటింది. మండల కేంద్రమైన చెన్నూరుకు చెందిన రిహానా పర్వీన్ మే నెలలో నిర్వహించిన పీజీ సెట్లో 100కు 99 మార్కులు సాధించి స్టేట్ మొదటి ర్యాంకు కైవసం చేసుకుంది. శ్రమకు తగిన ఫలితం దక్కిందని, భవిష్యత్లో బాగా చదివి, ఉన్నత స్థానానికి ఎదగుతానని ఆమె అన్నారు. రిహానా పర్వీన్ను తల్లిదండ్రులు, ఊరి పెద్దలు ఆశీర్వదించారు.