PLD: వెల్దుర్తి మండల కేంద్రానికి చెందిన టీడీపీ నాయకుడు వెలిశెట్టి బాల వెంకయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.