రూ.2 వేల నోట్ల రద్దు తర్వాత కరెన్సీ మార్కెట్లో రూ.500 నోటు ‘బాద్షా’గా మారింది. చలామణీలో ఉన్న మొత్తం నోట్లలో సంఖ్యా పరంగా 41.2 శాతం, విలువ పరంగా ఏకంగా 86 శాతం వాటా దీనిదేనని RBI తాజాగా వెల్లడించింది. వీటి చలామణీ విలువ రూ.35.27 లక్షల కోట్లకు పెరిగింది. రూ.10 నోటు రెండో స్థానంలో నిలవగా.. ఆర్థిక వ్యవస్థలో నగదు డిమాండ్ ఇంకా కొనసాగుతోందని RBI పేర్కొంది.