AP: ఆయేషామీరా అవశేషాలను సీబీఐ జడ్జి తల్లిదండ్రులకు అప్పగించారు. సీబీఐ న్యాయమూర్తి ఎదుట ఆయేషా తల్లిదండ్రులు బోరున విలపించారు. తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెనాలిలో ఆయేషామీరా అవశేషాల ఖననానికి ఏర్పాట్లు చేశారు. తెనాలి శ్మశానం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. కాసేపట్లో ఆయేషామీరా అవశేషాలకు అంత్యక్రియలు నిర్వహించానున్నారు.