PDPL: పౌరసరఫరాల మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి నేడు జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12:45కు పెద్దపల్లికి చేరుకుని అక్కడి నుంచి పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి పరిశీలిస్తారు. అనంతరం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలుపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. తిరిగి 2:45కు హనుమకొండకు బయలుదేరి వెళ్తారని అధికారులు ప్రకటన విడుదల చేశారు.