BPT: వేటపాలెం బైపాస్లోని గాయత్రి రెస్టారెంట్ సమీపంలో జాతీయ రహదారి-216పై రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కొణిజేటి నగర్కు చెందిన పఠాన్ యాసిన్ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని AP 29S 6868 నంబర్ గల కారు వెనుక నుంచి ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయినట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.