సత్యసాయి: సోమందేపల్లి మండలం బుసయ్యగారి పల్లిలో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ‘కాఫీ విత్ క్యాడర్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గడపగడపకూ వెళ్లి ప్రజలను పలకరించారు. గత జగనన్న ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందాయని గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టి అన్యాయం చేస్తోందని విమర్శించారు.