MBNR: పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. భూత్పూర్ మండలం షేర్ పల్లి, హస్నాపూర్ గ్రామాల్లో నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో ఆయన పాల్గొన్నారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి సర్కార్ పేదలకు అండగా ఉంటూ సంక్షేమ పథకాలను అద్భుతంగా అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.