SKLM: జిల్లాలో వెట్టి చాకిరీని పూర్తిగా రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. వెట్టిచాకిరీ వ్యవస్థ నిర్మూలన చట్టం అమలులోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం జిల్లా కోర్టు ఆవరణలో అవగాహన పోస్టర్లను ఆవిష్కరించి, సంచార వాహనాన్ని ప్రారంభించారు. ఇందులో సీనియర్ న్యాయవాదులు ఉన్నారు.