KRNL: చిలకలడోనలోని ఎస్సీ కాలనీలో 4 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని ఇవాళ కాలనీవాసులు జిల్లా అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. భూమిని సర్వే చేసి పేదలకు పంచిపెట్టడంతో పాటు కమ్యూనిటీ హాల్ నిర్మించాలని వారు కోరారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ స్థలాన్ని పరిశీలించగా కొంత ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ భూమిపై సర్వే చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.