మారుతీ సుజుకీ కార్ల ధరలు జూన్ నుంచి పెరగనున్నాయి. ఈ మేరకు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది. అన్ని మోడళ్ల ధరలను రూ.30 వేల వరకు పెంచనుంది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. గత కొన్ని నెలలుగా ధరలు పెంచకుండా వ్యయాన్ని తగ్గించేందుకు కంపెనీ నిరంతర ప్రయత్నాలు చేసినట్లు పేర్కొంది.