BPT: వయోజన విద్యా కార్యక్రమాలను వేగవంతం చేసి ‘అక్షరాంధ్ర’ లక్ష్యాలను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం వయోజన విద్యా కార్యక్రమాలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన సమీక్ష నిర్వహించారు. మార్చి 4న నిర్వహించనున్న ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు.