SDPT: అక్కన్నపేట మండలం మల్చేరుతండా గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను సర్పంచ్ గుగులోతు మహేందర్ నాయక్, వార్డు సభ్యులు రజిత సంపత్ పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడుతూ.. పని ప్రదేశాల్లో తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. పనులు నాణ్యతగా కూలీల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ కొనసాగించాలని తెలిపారు.