ADB: ఉట్నూర్ మండలం కల్లూర్ గూడలో భీంరావు, సుగుణల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ హాజరయ్యారు. ఈ సందర్బంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జైనూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ విశ్వనాథ్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ మారుతి తదితరులు పాల్గొన్నారు.