KMM: మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్లో ఎస్సీ, ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ డైరీని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.