MBNR: ఆడబిడ్డల వివాహానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ గ్రామీణ మండలాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేసి మాట్లాడారు. ఆర్థికంగా వెనుకబడిన పేద ప్రజలకు ప్రభుత్వం లబ్ధి చేస్తుందని పేర్కొన్నారు.