ATP: గుంతకల్లు మీదుగా వెళ్లే పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాస్కోడిగామా వరకు వెళ్లే షాలీమార్, తిరుపతి, హైదరాబాద్, సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్లను ఏప్రిల్ నుంచి జూన్ వరకు హుబ్లీ స్టేషన్ వరకే పరిమితం చేశామని అన్నారు. హుబ్లీ-వాస్కోడిగామా మధ్య ఈ రైళ్లు నడవవని, ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలని కోరారు.