MDK: హవేలిఘనపూర్ మండలం గంగాపూర్ అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని చాకలి గోపాల్(48) మృతి చెందాడు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. గతంలో అదే గ్రామానికి చెందిన తల్లి, కుమారుడి హత్య కేసులో గోపాల్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.