ASR: యువతలో నాయకత్వ లక్షణాలు పెంచడానికి కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా కృషి చేస్తుందని అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా కేబీకే నాయక్ అన్నారు. బుధవారం కళాశాలలో నిర్వహించిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్-2026ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 83 మంది యువత పాల్గొని 50 ఇయర్స్ ఎమర్జేన్సీ, లెసన్స్ ఫర్ ఇండియన్ డెమోక్రసీ అంశంపై మాట్లాడారు.