కర్ణాటకలోని ఓ ఐఫోన్ తయారీ ప్లాంటులో దారుణం చోటుచేసుకుంది. ఆ ప్లాంట్లో పనిచేస్తున్న 19 ఏళ్ల యువతి టాయిలెట్లో బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆ యువతి పసికందు గొంతుకోసి హతమార్చి ఓ సంచిలో పడేసింది. ఆ యువతికి ఇంకా వివాహం కాలేదని.. ఈ విషయం తెలిస్తే పరువు పొతుందేమోనని భయాందోళనతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.