రేపు జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్కు ముందు టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శాంసన్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉందన్నాడు. అలాగే, అభిషేక్, తిలక్ ఫామ్ విషయంలో తమకు ఎటువంటి ఆందోళన లేదని పేర్కొన్నాడు. ‘వారు రెండు బౌండరీలు బాదితే అంతా సర్దుకుంటుంది’ అని తెలిపాడు. పిచ్ పరిస్థితిని బట్టి తుది జట్టు ఎంపిక ఉంటుందని స్పష్టం చేశాడు.