గుంటూరు: జీజీహెచ్ నుంచి ఖైదీ అజిత్ పరారీ ఘటనలో కీలక విషయాలు వెలుగుచూశాయి. ఆసుపత్రికి వెళ్లేందుకు రేపల్లె జైలర్కు ఖైదీ సోదరి రూ.60వేలు లంచం ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. ఆసుపత్రిలో ఎస్కార్ట్ కానిస్టేబుల్కు రూ.500 ఇచ్చి టిఫిన్కు పంపి అతడు పారిపోయాడు. ఈ వ్యవహారంలో లంచం తీసుకున్న జైలర్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.