E.G: నిడదవోలు RTC డిపో వద్ద పట్టణ ప్రజల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్షేమ సంఘం అధ్యక్షులు రాంబాబు మాట్లాడుతూ.. నిడదవోలు RTC డిపోలో నాణ్యమైన బస్సులు నడపాలని డిమాండ్ చేశారు. అలాగే విజయవాడ నుంచి ఇచ్ఛాపురం వరకు సర్వీసులు నడపాలని, విద్యుత్ బస్సుల పేరుతో డిపోల మూసివేతను వ్యతిరేకించారు.