GNTR: బృందావన్ గార్డెన్స్లోని నిర్మానుష్య ప్రాంతంలో యువకులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఓ మహిళ చేసిన ఫిర్యాదుపై బుధవారం ఎమ్మెల్యే గళ్ళా మాధవి వెంటనే స్పందించారు. స్వయంగా ద్విచక్ర వాహనంపై అక్కడికి చేరుకోగా, ఆమెను చూసి యువకులు పరారయ్యారు. అనంతరం స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్యే, ఆ ప్రాంతంలో పోలీస్ గస్తీ నిర్వహించాలన్నారు.