AKP: నాతవరం:ఎంపీడీవో ఎం.ఎస్. శ్రీనివాస్ బుధవారం పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో పారిశుద్ధ్య, చెత్త సేకరణ, తాగునీటి పరిశుభ్రతపై చర్యలు తీసుకోవాలని, బయోమెట్రిక్ హాజరు, మూమెంట్ రిజిస్టర్ తప్పనిసరిగా పాటించాలన్నారు. సిబ్బంది నిర్లక్ష్యానికి చర్యలు తప్పవని హెచ్చరించారు.