బాపట్ల: కర్లపాలెం మండలంలోని అన్ని గ్రామాల్లో జరుగుతున్న సర్వేలను వేగవంతం చేయాలని ఎంపీడీవో అద్దూరి శ్రీనివాసరావు ఆదేశించారు. ఆయన చింతాయపాలెం, కర్లపాలెం పంచాయతీల్లో బుధవారం పర్యటించారు. ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న సర్వేల తీరును పరిశీలించారు. సర్వేల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేలా పంచాయతీ సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు.