ATP: గార్లదిన్నె మండలంలో మరణించిన భారత సైనికుడు సాకే నరేష్ భౌతికకాయానికి ఏడీసీసీ బ్యాంకు ఛైర్మన్ మొంటిమడుగు కేశవరెడ్డి సతీమణి విజేత నివాళులర్పించారు. గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని నరేష్ కుటుంబ సభ్యులను అక్కున చేర్చుకుని పరామర్శించారు. ప్రభుత్వం నుంచి తగిన సాయం అందేలా చూస్తామని, ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.