ప్రకాశం: ఇటీవల టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన మంత్రి లోకేష్ బాబును ఉండవల్లిలోని తన నివాసంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, వారి కుమార్తె భవ్య నందినిలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. గత వైసీపీ అరాచక పాలనలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న యువగళం పాదయాత్ర గేమ్ చేంజర్గా మారి అధికారంలోకి రావడానికి తోడ్పడిందని ఎమ్మెల్యే తెలిపారు.