E.G: దేవరపల్లి-గోపాలపురం మూడు రోడ్ల సెంటర్ వద్ద డ్రైనేజీ ఆక్రమణలతో మురుగునీరు రోడ్లపైకి చేరుతోంది. దుర్వాసనతో ప్రయాణికులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు నామమాత్రపు పనులు కాకుండా, ఆక్రమణలు తొలగించి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరారు. మురుగునీటి సమస్యతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.